పుణె,జూలై :ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల ఫోర్టమ్ చార్జ్,డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ చార్జింగ్ స్టేషన్ లో కంబైన్డ్ చార్జింగ్ సిస్టమ్ (సీసీఎస్2) కు మద్దతిచ్చే ఏదైనా ఎలక్ట్రిక్ కారును చార్జ్ చేయవచ్చు. దీని కోసం కారు యజమాని ఫోర్టమ్ మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చార్జర్తో ఎంజి జెడ్ఎస్ ఈవి ని కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు చార్జ్ చేయవచ్చు.
ఎంజీ మోటార్ ఇండియా ఈ ఎస్యూవీ కోసం ఫ్రీ ఎసి చార్జర్, ప్లగ్-అండ్-చార్జ్ కేబుల్ ఆన్బోర్డ్ను కూడా అందిస్తుంది.దీని సహాయంతో ఈ ఎలక్ట్రిక్ కారును ఇండ్ల వద్ద గానీ,ఆఫీస్ వద్ద గానీ సులభంగా చార్జ్ చేయవచ్చు. అంతే కాకుండా ప్రయాణంలో కూడా రోడ్ పక్కన చార్జ్ చేయవచ్చు.
ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ‘గౌరవ్ గుప్తా’ మాట్లాడుతూ ఫోర్టమ్తో మా అనుబంధం దేశంలో పర్యావరణానికి మేలు చేసే పరిష్కారాల కోసం మౌలిక సదుపాయాలను కల్పించాలనే మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని అన్నారు. దశలవారీగా మరిన్ని నగరాల్లో ఈ సూపర్ ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.