శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఉష్ణోగత్రలు పడిపోతున్నాయి. శ్రీనగర్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 1.6 డిగ్రీలకు చేరగా.. ఈ సీజన్లో అత్యంత చలిరోజుగా నిలిచింది. కశ్మీర్లో చాలా జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నది. లేహ్, కార్గిల్లో కూడా చలి విపరీతంగా ఉన్నది. జమ్మూలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు తగ్గాయి.
రాబోయే రోజుల్లో చలి కొనసాగుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కశ్మీర్లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కూడా 16 డిగ్రీల కంటే తక్కువగా ఉంటున్నది. చలి గాలులతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతున్నది. శ్రీనగర్లో పగటి ఉష్ణోగ్రత 13.5 డిగ్రీలుగా నమోదైంది. గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత పహల్గామ్లో మైనస్ 3.7, గుల్మార్గ్లో మైనస్ 0.8, కనిష్ఠ ఉష్ణోగ్రత 8డిగ్రీలతో లేహ్ అత్యంత శీతల ప్రదేశంగా మారింది.
ఇక్కడ పగటి ఉష్ణోగ్రత కూడా 6.5 డిగ్రీలుగా నమోదువుతున్నాయి. కార్గిల్లో గత రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 5, పగటి ఉష్ణోగ్రత 9.5 డిగ్రీలుగా ఉన్నాయి. జమ్మూలో చలి పెరిగింది. ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలు, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత 9 డిగ్రీలుగా ఉన్నది. డివిజన్లో బనిహాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 1.4, బటోట్లో 5.7, కత్రాలో 10.2, భదర్వాలో 2.6లుగా రికార్డయ్యింది.