జైపూర్: సుమారు ఆరు కోట్ల విలువైన నగలను దోచుకెళ్లిన దొంగలు.. అనూహ్య రీతిలో పోలీసులకు చిక్కారు. ఓ క్యాబ్ డ్రైవర్కు పేటీఎం ద్వారా రూ.100 ట్రాన్స్ఫర్ చేసిన ఆ దొంగలు పోలీసుల విచారణలో దొరికిపోయారు. ఢిల్లీలోని పహార్గంజ్లో శుక్రవారం ఓ భారీ చోరీ జరిగింది. తెల్లవారుజామున ఓ డెలివరీ బాయ్, అతని స్నేహితుడు పార్సిల్తో వెళ్తుండగా ఇద్దరు వారిని అడ్డుకున్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తితో పాటు మరో ఇద్దరు వచ్చి డెలివరీ బాయ్ వద్ద ఉన్న పార్సిల్కు లాక్కున్నారు. కండ్లల్లో కారం చల్లి మరీ ఆ పార్సిల్తో పరారీ అయ్యారు. డెలివరీ బాయ్ సోమ్వీర్ ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు దొంగల్ని పట్టుకున్నారు. నగేశ్ కుమార్, శివం, మనీశ్ కుమార్లు ముగ్గురూ నజాఫ్ఘర్కు చెందినట్లు పోలీసులు చెప్పారు.
దర్యాప్తు సమయంలో ఢిల్లీ పోలీసులు సుమారు 700 సీసీటీవీ ఫూటేజీలను చెక్ చేశారు. స్థానిక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా సేకరించారు. అయితే నలుగురు అనుమానాస్పద ప్రవర్తనతో కేసును చేధించారు. జ్వలరీ దొంగలించిన వ్యక్తుల్లో ఒకరు క్యాబ్ డ్రైవర్కు పేటీఎంలో రూ.100 ట్రాన్స్ఫర్ చేశాడు. ఛాయ్ తాగేందుకు క్యాష్ లేదు కాబట్టి, ఆ డ్రైవర్కు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నారు. ఆ ట్రాన్స్ఫర్ నెంబర్ ద్వారా కేసును చేధించినట్లు డిప్యూటీ కమీషనర్ శ్వేతా చౌహాన్ తెలిపారు. లావాదేవీని విశ్లేషించి, నిందితులు నజాఫ్ఘర్కు చెందినట్లు గుర్తించారు. చోరీ అయిన వస్తువుల్లో 6 కిలోల బంగారం, మూడు కిలోల వెండి ఉన్నాయి. చోరీ మాస్టర్మైండ్ నగేశ్ను పట్టుకునేందుకు పోలీసులు వెంటాడుతున్నారు.