షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మరక్ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యభిచార గృహం గుట్టు రట్టు అయిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న బెర్నార్డ్ను ఉత్తరప్రదేశ్లో అరెస్టు చేశారు. తన ఫార్మ్హౌజ్లో వ్యభిచార గృహాన్ని నడుపుతున్నట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. యూపీలో అరెస్టు అయిన బెర్నార్డ్ను తీసుకువచ్చేందుకు తమ బృందం వెళ్తున్నట్లు వెస్ట్ గారో హిల్స్ ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు. వ్యభిచార గృహంలో ఆరుగురు చిన్నారులను పోలీసులు రక్షించారు. ఇద్దరు మైనర్ అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. 73 మందిని అరెస్టు చేశారు. పశ్చిమ గారోహిల్స్ జిల్లాలో ఉన్న బెర్నార్డ్ మరక్కు చెందిన రింపు బగన్ అనే ఫాంహౌజ్పై దాడులు నిర్వహించినట్టు ఎస్పీ వివేకానంద్ సింగ్ వెల్లడించారు. 27 వాహనాలు, 400 మద్యం బాటిళ్లు, 500 కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు.
బెర్నార్డ్ కోసం మేఘాలయా పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు. తుర కోర్టు ఆ బీజేపీ నేతపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఫార్మౌజ్లో తనిఖీ చేసిన సమయంలో 47 మంది యువకులు, 26 మంది మహిళలు.. బట్టలు లేకుండా తాగిన మైకంలో ఉన్నట్లు గుర్తించారు. తాను అమాయకుడినని, సీఎం కాన్రాడ్ సంగ్మా రాజకీయ కుట్రతో తనను ఇరికించినట్లు బెర్నార్డ్ తెలిపారు.