సిటీబ్యూరో, జనవరి 20(నమస్తే తెలంగాణ): ఇంటింటికీ ఆరోగ్యం పేరిట కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం నుంచి ఇంటింటి జ్వర సర్వే చేపట్టఇంటింటికీ ఆరోగ్యం చేశారు. ప్రతి బృందంలో ఒక ఆరోగ్య కార్యకర్త, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొని జ్వర వివరాలను సేకరించనున్నారు. జ్వర లక్షణాలున్న కుటుంబానికి హోం ఐసొలేషన్ కిట్లు ఇస్తారు. వారి ఆర్యోగ్యాన్ని రోజూవారీగా మానిటర్ చేస్తారు. అవసరమైతే గాంధీ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టనున్నారు.
వీటితో పాటు అధిక జ్వరాలు సోకిన ప్రాంతాలలో శానిటైజేషన్, ఎంటమాలజీ బృందాలు పర్యటించి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. జ్వర సర్వేలో భాగంగా తొలుత మురికి వాడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశాలున్న నేపథ్యంలో మురికివాడల్లో ఆరు రోజుల్లోగా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు. మిగతా ప్రాంతాలలోనూ త్వరితగతిన పరీక్షలు జరుపనున్నారు. ఈ సర్వేలో ఇంటి సభ్యుల వ్యాక్సినేషన్ వివరాలను సేకరించి ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు.
సర్కిల్కు రెండు ఐసొలేషన్ కేంద్రాలు..
బస్తీ దవాఖానాల్లో ఇప్పటికే కరోనా టెస్టింగ్, హెల్త్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు సర్కిళ్ల వారీగా హోం ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. ఇందులో పడకలు, ఆహార వసతులు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను సమకూర్చారు. అవసరమైతే సర్కిల్కు అదనంగా మరొకటి ఉండేలా కమ్యూనిటీ హాల్, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల వివరాలను సేకరించి స్థలాలు ఎంపిక చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
విస్తృత స్థాయిలో పిచికారీ
30 సర్కిళ్లల్లోనూ రోజూ దాదాపు 200 లీటర్ల సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు. ఇందుకు 6 జోన్లలో సుమారు 500లకు పైగా సిబ్బందిని నియమించినట్లు ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు. అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రార్థన మందిరాలపై దృష్టి సారించారు.
‘మేడ్చల్’లో రోజూ 25 ఇళ్లల్లో సర్వే..
మేడ్చల్, జనవరి 20(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగానూ ఫీవర్ సర్వేను గురువారం నుంచి నిర్వహించనున్నారు. వైద్య బృందాలలోని ఒక బృందం ప్రతి రోజు తప్పని సరిగా 25 ఇళ్లల్లో ఫీవర్ సర్వేను నిర్వహించేలా వైద్య శాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఫీవర్ సర్వేలో గ్రామ పంచాయితీ, మున్సిపల్ సిబ్బంది వైద్య బృందంలో ఉంటారని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు.
జోన్: శానిటైజ్ చేయాల్సిన ఇండ్ల సంఖ్య (సరాసరి)
ఎల్బీనగర్: 122
చార్మినార్ :343
ఖైరతాబాద్: 85
సికింద్రాబాద్: 289
శేరి లింగంపల్లి: 171
కూకట్పల్లి : 262
కట్ :1272