మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 8: సీఎం కేసీఆర్ నిరుపేదల పక్షపాతి అని కౌన్సిలర్ నాగాయిపల్లి సుజాత శ్రీనివాస్ అన్నారు. బుధవారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీకి చెందిన తులసికి రూ.30 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశారన్నారు. సీఎం కేసీఆర్, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు కన్నయ్య, మహిళా అధ్యక్షురాలు రజిత, నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లిలో..
మేడ్చల్ రూరల్, డిసెంబర్ 8: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీకి చెందిన స్వామికి సీఎం సహాయ నిధి చెక్కును చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్రెడ్డి బుధవారం అందజేశారు. అనారోగ్యం కారణంగా చికిత్స పొందిన లబ్ధిదారుడికి మంత్రి మల్లారెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో ఆయనకు రూ.60 వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ అందజేశారు. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు అమరం జైపాల్రెడ్డి, హేమంత్ రెడ్డి పాల్గొన్నారు.