నర్సాపూర్, మార్చి 22 : పట్టణ శివారులో గల బీవీఆర్ఐటీ కళాశాలలో మంగళవారం ప్రపంచ జల దినోత్సవ సదస్సును నిర్వహించారు. సదస్సుకు తెలంగాణ వాలంతరీ నీరు, భూమి నిర్వహణ, శిక్షణ పరిశోధన సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించిందని పేర్కొన్నారు. ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని ప్రతిపాదికగా తీసుకుంటున్నారని, ఈ ఏడాది ‘భూగర్భ జలాల వృద్ధి, అభివృద్ధి, సమృద్ధి’ అనే అంశంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిందని చెప్పారు. నీటిని వృథా చేయొద్దని సూచిం చారు. ఈ సందర్భంగా సివిల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి డాక్టర్ శ్రీదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్, పోస్టర్ ప్రజెంటేషన్, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల మేనేజర్ బాపిరాజు, ఏవోడబ్ల్యూ అశోక్రెడ్డి, సివిల్, కెమికల్, ఫార్మా ఇంజినీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో..
చిలిపిచెడ్, మార్చి 22 : నీరు లేనిదే ప్రాణి లేదు.. ప్రతిఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని చిలిపిచెడ్ ఉన్నత పాఠశాల హెచ్ఎం విఠల్ అన్నారు. మంగళవారం చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో ప్ర పంచ జల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నీటిపై అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేశ్, ఆదినారాయణ, నాగరాణి, రుక్మిణి, రేణుక, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలవికాస ఆధ్వర్యంలో..
మనోహరాబాద్, మార్చి 22 : ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గౌతోజిగూడలో మంగళవారం అవగాహన ర్యాలీ, ప్రతిజ్ఞ నిర్వహించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పాఠశాల విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
విద్యార్థులకు అవగాహన
శివ్వంపేట, మార్చి 22 : మండలంలోని నవాబ్పేట ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా నీటి ప్రాముఖ్యతపై ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్రావు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఐటీసీ వారి సహకారంతో సర్పంచ్ అశోక్రెడ్డితో కలిసి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐటీసీ ఇంజినీర్ వర్ధన్, ప్రతాప్రెడ్డి, ఉపాధ్యాయులు మంజుల, తేజశ్రీ పాల్గొన్నారు.