ముంబై, మార్చి 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతోపాటు బ్లూచిప్ సంస్థలకు మదుపరుల నుంచి లభించిన మద్దతు కూడా తోడవడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయి. ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య శాంతిచర్చలు జరుగుతుండటం కూడా సూచీలకు కలిసొచ్చింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ బీఎస్ఈ సెన్సెక్స్ 350.16 పాయింట్లు అందుకొని 57,943.65 వద్దకు చేరుకోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 103.30 పాయింట్లు అందుకొని 17,325.30 వద్ద నిలిచింది.
30 షేర్ల ఇండెక్స్లో 20 షేర్లు లాభపడగా, 10 షేర్లు నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్ఫార్మాలు ఒక్క శాతానికి పైగా పెరిగాయి. వీటితోపాటు రెడ్డీస్, హెచ్యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ఫిన్, మహీంద్రా, విప్రో, హెచ్సీఎల్ టెక్, నెస్లె, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, రిలయన్స్లు లాభపడ్డాయి.
కానీ, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, మారుతి, పవర్గ్రిడ్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, టీసీఎస్లు నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్లు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే హెల్త్కేర్(1.36 శాతం), రియల్టీ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించగా..ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, వాహన రంగ షేర్లు కుదేలయ్యాయి.
బ్యారెల్ క్రూడాయిల్ ధర ఐదు శాతం తగ్గి 103 డాలర్లకు పడిపోయింది.
రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య మరోదఫా శాంతి చర్చలు జరుగుతుండటం, క్రూడాయిల్ బలహీనపడటం మార్కెట్లకు కలిసొచ్చింది.