రామారెడ్డి, ఆగస్టు 9: బీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బుధవారం రూ.కోటీ 33లక్షల 94వేలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పద్మశాలీలు, దళిత యూత్, మహిళలు సుమారు వందమంది బీఆర్ఎస్లో చేరారు. వారికి విప్.. గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందజేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలని ఈ సందర్భంగా గంప గోవర్ధన్ కోరారు. అంతకు ముందు ఆయన.. బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి రూ. 10లక్షలు మంజూరు చేశారు. కార్యక్రమంలో మాచారెడ్డి ఎంపీపీ లోయలపల్లి నర్సింగ్రావు, రామారెడ్డి ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, మద్దికుంట సర్పంచ్ బొమ్మిడి రాంరెడ్డి, మాచారెడ్డి జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, కామారెడ్డ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పిప్పిరి వెంకట్, బీఆర్ఎస్ రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గజ్జెల శంకర్, మాచారెడ్డి సొసైటీ చైర్మన్ పూల్చంద్ నాయక్, సొసైటీ డైరెక్టర్ బొంబోతుల స్వామి గౌడ్, రామారెడ్డి వైస్ ఎంపీపీ రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.
పిట్లం మండలంలో..
పిట్లం, ఆగస్టు 9: కామారెడ్డి జిల్లా పిట్లం మండలానికి చెందిన పలువురు ఇతర పార్టీల నుంచి జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తిమ్మానగర్ గ్రామంలో 7వ వార్డు సభ్యుడు బేగరి శ్రీను, రాంపూర్ గ్రామంలో ర్యాల దత్తారెడ్డి, గూల సాయిలు బీఆర్ఎస్లో చేరగా.. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు పిట్లం మండలం మార్దాండలో బీసీ కమ్యూనిటీ హాల్, గోద్మేగాం, చిన్నకొడప్గల్, రాంపూర్, గౌరారం గ్రామాల్లో నూతన పంచాయతీ భవనాలు, చిన్నకొడప్గల్లో అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని అన్నారు. మరోసారి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కవిత, జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్, నాయకులు వెంకట్రాంరెడ్డి, ప్రతాప్రెడ్డి, రహమతుల్లా, జగదీశ్, నారాయణరెడ్డి, శపథంరెడ్డి, విజయ్, మహిపాల్రెడ్డి, బాబూసింగ్, దేవేందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవో వెంకటేశ్వర్, ఎంపీవో బ్రహ్మం, పీఆర్ ఏఈ సురేశ్, జీపీ కార్యదర్శులు పాల్గొన్నారు.