శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని నూర్బాగ్లోని ఓ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సుమారు ఇండ్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఓ ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. గ్యాస్తో మంటలు చెలరేగి మిగతా ఇండ్లకు వ్యాపించాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. వారికి స్థానికులు సైతం సహాయం అందించారు.
ఇరుకైన రోడ్లు ఉండడంతో ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి తరలించేందుకు ఇబ్బందులెదురయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు సైన్యం రెండు, అగ్నిమాపక శాఖ ఐదు ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించాయి. డిప్యూటీ సూపరింటెండెంట్, అదనపు సూపరింటెండెంట్, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా పలువురు సీనియర్ అధికారులు సంఘటనా స్థలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు.