హైదరాబాద్ : నకిలీ విత్తనాలపై(Cotton seeds) పోలీసులు కొరడా ఝులిపస్తున్నారు. తాజాగా సిద్దిపేటలో (Siddipet) ప్యాకింగ్ లేకుండా 29 సంచుల్లో నిల్వ ఉంచిన 1450 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సిద్దిపేట టాస్క్ఫోర్స్,హుస్నాబాద్ పోలీసులు సీజ్(siege) చేశారు. ఒక్కో సంచిలో 50 కిలోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు, పురుగులు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.