న్యూఢిల్లీ, మార్చి 2: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఎట్టకేలకు తన ఉత్పత్తిని పెంచుకున్నది. గత నెలలో సంస్థ 1,69,692 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఏడాది క్రితం ఇదే నెలలో ఉత్పత్తైన 1,68,180లతో పోలిస్తే ఇది స్వల్పంగా పెరిగినట్లు వెల్లడించింది. చిప్ల కొరత ఉన్నప్పటికీ గత నెలల కొంతమేర ప్రభావం చూపిందని, వచ్చే రెండు నెలల వరకు పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి నెలలో ఉత్పత్తైన మొత్తం వాహనాల్లో 1,65,672 ప్యాసింజర్ వాహనాలు కావడం విశేషం.