సికింద్రాబాద్, డిసెంబర్ 5: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్లోని మడ్ఫోర్ట్ అంబేద్కర్ హాట్స్లో ఆదివారం నల్లగొండకు చెందిన దాత చింతపల్లి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, అడిషనల్ డీసీపీ పరవస్తు మధుకర్ స్వామి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న చింతపల్లి కృష్ణారెడ్డిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, సదా కేశవరెడ్డి, పాండుయాదవ్, టీఆర్ఎస్ సీనియర్ నేతలు టీఎన్ శ్రీనివాస్, నివేదిత, ముప్పిడి మధుకర్, సదానంద్గౌడ్, మురళీయాదవ్, పనస సంతోశ్, అజిత్ కల్యాణ్, అంబేద్కర్ హాట్స్ అధ్యక్షుడు సాంబ అశోక్, కొమురయ్య, సాంబయ్య, పరశురామ్, వెంకట్రాముడు, రోశప్ప, తదితరులు పాల్గొన్నారు.