నిర్మల్ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు రైతులకు విజయ డైయిరీ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తున్నామని విజయ డైయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని సోఫినగర్ విజయ డెయిరీ పాల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విజయ డెయిరీ ద్వారా పాల కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులను మంజూరు చేశామని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లాలో 50వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. ప్రతి గ్రామంలో పాల విజయ డెయిరీ పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులకు పాడి గేదెలతో పాటు పాలపై 5శాతం డెబిట్ను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్, మేనేజర్ దస్రునాయక్, శ్రీకాంత్, డీఎంసీ మేనేజర్లు సాయన్న, గజ్జారాం, వెంకటేశ్, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.