జగిత్యాల : రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్అన్నారు. బీర్పూర్ మండలం కోల్వాయి గ్రామానికి చెందిన 20మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సర్పంచ్ మల్లేశం అధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు.
కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు కొలుముల రమణ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శీలం రమేష్, గ్రామ శాక అధ్యక్షుడు రామకృష్ణ, సతీష్, రమేష్,గుండా సురేష్, తదితరులు పాల్గొన్నారు.