మహేశ్వరం:గ్రామాలభివృద్ది కొరకు తన వంతు సహకారం అందిస్తానని రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్సాన్పల్లి గ్రామస్తులు ఉపసర్పంచ్ బురమోని నర్సింహ్మయాదవ్ ఆద్వర్యంలో మంత్రిని కల్సి గ్రామాభివృద్దికి సహకారమందించాలని కోరారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్ని గ్రామాలు అభివృద్దిపధంలో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, వారిని గ్రామాభివృద్దిలో పాలుపంచుకునే విదంగా కృషిచేయాలని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు కందిరమేష్,మురళీధర్రెడ్డి,మాజీ సర్పంచ్లు జాన్రెడ్డి,మల్లేష్యాదవ్,సీతారాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.