భువనేశ్వర్: టోక్యో విశ్వ క్రీడల్లో కాంస్యంతో సత్తా చాటిన భారత హాకీ బృందం మరో మెగాటోర్నీకి సిద్ధమైంది. టోక్యో ఒలింపిక్స్ సుదీర్ఘ విరామం తర్వాత హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ టోర్నీలో బరిలోకి దిగుతున్నది. ఒలింపిక్స్ ఉత్సాహంతో ఆసియా ట్రోఫీ చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో భారత బృందం సన్నద్ధమైంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో డిసెంబర్ 14 నుంచి జరుగనున్న ఆసియా ట్రోఫీలో పాల్గొనే జట్టును హాకీ ఇండియా శుక్రవారం ప్రకటించింది. మన్ప్రీత్సింగ్ సారథ్యంలో 20 మందితో కూడిన జట్టులో వెటరన్ గోల్కీపర్ శ్రీజేశ్కు విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో కృషన్ బహదూర్ పఠాక్, సూరజ్ కర్కేరా వచ్చారు. ఈ మెగాటోర్నీలో డిసెంబర్ 14న మొదటి మ్యాచ్ కొరియాతో, 15న బంగ్లాదేశ్, 17న పాకిస్థాన్, 18న మలేషియా, 19న జపాన్తో భారత్ తలపడనుంది.
గోల్ కీపర్స్: క్రిషన్ బహదూర్ పఠాక్, సూరజ్ కర్కేరా
డిఫెండర్స్: హర్మన్ప్రీత్ సింగ్, గురీందర్, జర్మాన్ప్రీత్, దిప్సన్, వరుణ్, నీలమ్ సంజీప్, మన్దీప్
మిడ్ఫీల్డర్స్: హార్దిక్, మన్ప్రీత్, జస్కరన్, సుమిత్, రాజ్కుమార్, ఆకాశ్దీప్, శంషేర్ సింగ్
ఫార్వర్డ్స్: లలిత్ ఉపాధ్యాయ్, దిల్ప్రీత్, గుర్సాహిబ్జీత్, శిలానంద్ లక్రా