రంగియోర (న్యూజిలాండ్): వామప్ మ్యాచ్లో గాయపడిన భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన వన్డే ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని బీసీసీఐ వైద్య బృందం ప్రకటించడంతో మెగా టోర్నీలో స్మృతి బరిలోకి దిగనుంది. ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వామప్ మ్యాచ్లో స్మృతి తలకు గాయమైంది. షబ్నీమ్ ఇస్మాయిల్ వేసిన బంతి తలకు బలంగా తగలడంతో మందన రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ప్రపంచకప్ ఆడొచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో స్మృతి ఉందని బీసీసీఐ తెలిపింది. ైస్టెలిష్ బ్యాటర్ మందన.. భారత్ తరఫున 64 వన్డేలు ఆడి.. 2,461 పరుగులు చేయగా.. వాటిలో నాలుగు శతకాలు ఉన్నాయి. అయితే మంగళవారం వెస్టిండీస్తో జరిగే వామప్ మ్యాచ్ నుంచి మందనకు విశ్రాంతినివ్వనుండగా నేరుగా ఈనెల 6న ప్రపంచకప్లో దాయాది పాకిస్థాన్తో జరిగే పోరులో పోటీకి దిగనుంది.