ముషీరాబాద్, మార్చి 31: కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో మంద కృష్ణమాదిగకు ఉన్నది వ్యాపార బం ధమా? లేక రాజకీయ సంబంధమా అనేది స్పష్టంచేయాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ డిమాండ్ చేశారు. దళితులను మోసగించిన బీజేపీతో కృష్ణమాదిగ దోస్తీ కట్టడం ఏమిటని నిలదీశారు. గురువారం విద్యానగర్లోని సంఘం కా ర్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడు తూ.. గతంలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ కావాలన్న మంద కృష్ణ.. నేడు దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ కావాలని కోరడమేమిటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను వంచించిన బీజేపీతో మంద కృష్ణ కలిసి పనిచేయడమంటే నమ్మిన మాదిగలను మోసగించడమేనని మండిపడ్డారు. వర్గీకరణ కచ్చితంగా కేసీఆర్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు పాల్గొన్నారు.