ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో హీరో మంచు విష్ణు మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన మంచు విష్ణు జగన్తో సమావేశమయ్యారు. సినిమా పరిశ్రమలోని పలు సమస్యలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. టికెట్ ధరలు, సినిమా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న సహకారం వంటి అంశాలపై ఇరువురు మాట్లాడుకున్నారు. సీఎంతో కలిసి భోజనం చేసిన మంచు విష్ణు..అనంతరం ట్వీట్ చేస్తూ..ముఖ్యమంత్రి జగన్కు టాలీవుడ్ లోని అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు.