Mana Shankara Varaprasad garu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad garu). అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘పండగకు వస్తున్నారు’అనే ట్యాగ్లైన్తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్లో బిజీగా ఉంది చిరు టీం. కాగా పాపులర్ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫాం బుక్ మై షోలో మన శంకర వరప్రసాద్ గారు ట్రెండ్ కొనసాగుతోంది. బుక్ మై షోలో ఒక్క గంటలో 13 వేల టికెట్స్ బుకయ్యాయి. ఈ లెక్కన మన శంకర వర ప్రసాద్ మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉండబోతున్న నేపథ్యంలో మన శంకర వర ప్రసాద్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తూ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తుంది.
ఈ మూవీలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీని 2026 సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగతేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.
#ManaShankaraVaraPrasadGaru is making waves at BookMyShow. The Megastar #Chiranjeevi film is trending on BMS with 13k tickets booked in just the last hour. With the premiere just hours away, #MSG is heating up the box office. #MSGonJan12th pic.twitter.com/Z6kZqEZK58
— BA Raju’s Team (@baraju_SuperHit) January 11, 2026
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం