బెంగళూర్ : కర్నాటక రాజధాని బెంగళూర్లోవరద ఉధృతి తగ్గకపోవడంతో జనజీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదు. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, మరింత వర్షపాతం నమోదవుతుందనే అంచనాల నడుమ ఆఫీస్ పనులను చక్కబెట్టేందుకు ఉద్యోగులు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు.
కొందరు కాఫీ షాపునే కార్యాలయంగా ఎలా వాడుకుంటున్నారనే వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేయడంతో అది వైరల్గా మారింది. ఓ వ్యక్తి డెస్క్టాప్ సెటప్తో కాఫీ షాపులో కూర్చున్న ఫోటోను సంకేత్ సాహు అనే యూజర్ పోస్ట్ చేశారు.ఫుల్ఫ్లెడ్జ్డ్ డెస్క్టాప్ సెటప్తో థర్డ్ వేవ్ కాఫీలో పనిచేస్తున్న ఓ గ్రూపును ఇప్పుడే చూశానని ఈ పోస్ట్కు సంకేత్ సాహు క్యాప్షన్ ఇచ్చారు.
వారి కార్యాలయాలు వరద నీటితో మునకేయడంతో కాఫీ షాపు నుంచే కార్యాలయం పనులు చక్కబెడుతున్నారని రాసుకొచ్చారు. ఈ పోస్ట్కు వేలాది లైక్లు రాగా పెద్దసంఖ్యలో రియాక్షన్లు వచ్చాయి.