ఇక్కడ ఆకలికి మతం ఉండదు.. ప్రతిరోజూ నిరుపేదల కడుపు నింపడమే లక్ష్యం. ఏ గూడూ లేనివారు..దవాఖానలకు వచ్చేవారు.. ఆదరణ కరువైనవారు ఆకలితో అలమటించకుండా చూడడమే వీరి కర్తవ్యం. సాటి మనిషికి సాయం చేయడం మానవత్వం మాత్రమే కాదు, దైవత్వం కూడా అని భావించే రకం. ఇదీ సాని వెల్ఫేర్ ఫౌండేషన్ దాతృత్వం. దీనిని స్థాపించింది హైదరాబాద్కు చెందిన అజార్ మక్సుసి. ఆయన ఈ ఫౌండేషన్ స్థాపించేందుకు ఓ బలమైన కారణం ఉంది. మరి అదేంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి..