న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో (Delhi Metro) నజఫ్గఢ్ స్టేషన్లో మెట్రో రైల్కు ఎదురుగా వెళ్లి 31 ఏండ్ల లైబ్రేరియన్ మరణించిన ఘటన సోమవారం వెలుగుచూసింది. నజఫ్గఢ్ వద్ద వేగంగా వస్తున్న మెట్రో రైలు ముందు దూకి ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడినట్టు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు.
బాధితుడిని నజఫ్గఢ్లోని ప్రేమ్నగర్లో నివసించే మనీష్ కుమార్గా గుర్తించారు. మెట్రో రైల్ ఢీ కొనడంతో మనీష్ ఘటనా స్ధలంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. మనీష్ కుమార్ ఉత్తరాఖండ్లోని దేవ్ప్రయాగ్లో లైబ్రేరియన్గా పనిచేస్తున్నట్టు కుటుంబసభ్యులు చెప్పారు.
మనీష్కు భార్య, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో 20 నిమిషాల పాటు ఢిల్లీ మెట్రో సర్వీసులు నిలిచిపోగా ఆపై స్వల్ప విరామం అనంతరం పునరుద్ధరించారు.
Read More :