న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. (filthy’ Delhi hospital) టాయిలెట్స్ పొంగిపొర్లాయి. అక్కడి పరిసరాలు అపరిశుభ్రతతో నిండి ఉన్నాయి. ఈ ఆసుపత్రి పరిస్థితి గురించి ఒక వ్యక్తి ఎక్స్లో విమర్శించాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి ఇది వెళ్లడంతో ఆయన స్పందించారు. ఢిల్లీలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో గురు తేగ్ బహదూర్ (జీటీబీ) హాస్పిటల్ ఒకటి. అయితే అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మరుగుదొడ్లు పొంగిపొర్లడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రతతో నిండి ఉంది. దీంతో టాయిలెట్స్ పరిసరాల మీదుగా వెళ్లే వారు ముక్కు, నోరు మూసుకోక తప్పదు.
కాగా, అది పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశుభ్రత ఏమ్రాతం లేదంటూ ఒక వ్యక్తి ఆరోపించాడు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి గురించి ఎక్స్లో విమర్శించాడు. టాయిలెట్ వద్ద నేల రొచ్చుగా ఉన్న ఫొటోను అందులో పోస్ట్ చేశాడు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు దీనిని ట్యాగ్ చేశాడు.
మరోవైపు, జీటీబీ హాస్పిటల్లో అపరిశుభ్రతపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. పరిస్థితిని మెరుగుపర్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆ ఆసుపత్రిని సందర్శించి సీనియర్ అధికారులతో కలిసి తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిని ఆదేశించినట్లు ఎక్స్లో బదులిచ్చారు.