భువనేశ్వర్ : సీటి స్కాన్ చేయడంలో తీవ్ర జాప్యం చేశాడనే కోపంతో డాక్టర్ను చెప్పుతో కొట్టిన వ్యాపారిని ఒడిషా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబల్పూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వైద్యుడి సిఫార్సు మేరకు నిందితుడు నటబర్ బంక సీటీ స్కాన్ కోసం ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లాడు.
సీటీ స్కాన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన అనంతరం క్యూలో వేచిఉన్నాడు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా చాలా సేపు వేచిఉండాల్సి రావడంతో సహనం కోల్పోయిన నటబర్ ఆస్పత్రి సిబ్బంది ఎదుటే డాక్టర్ను చెప్పుతో కొట్టాడు. మహిళా నర్సుపైనా నిందితుడు దాడి చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాయి.
నిందితుడి దాడితో డాక్టర్ చిదానంద మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.