లుంపుర్: మేటి షట్లర్ పీవీ సింధు మలేషియా ఓపెన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో ఆమె థాయిలాండ్ ప్లేయర్ ఫిట్టయాపోర్న్ చైవాన్ను ఓడించింది. చైవాన్పై 19-21, 21-9, 21-14 స్కోర్తో సింధు విజయం సాధించింది. కోర్ట్ వన్లో జరిగిన మ్యాచ్లో చైవాన్ను ఓడించేందుకు సింధు తెగ కష్టపడింది. తొలి గేమ్ను ఆమె 19-21 తేడాతో కోల్పోయింది. అయితే సెకండ్ గేమ్లో సింధు తన సత్తా చాటింది. 21-9 తేడాతో ప్రత్యర్థిని ఓడించింది. ఇక మూడవ గేమ్లో లీడ్ తీసుకున్న సింధు చివరకు 21-14 తేడాతో మ్యాచ్ను కైవసం చేసుకున్నది. క్వార్టర్స్లో రెండవ సీడ్ తై జూ యింగ్తో సింధు తలపడనున్నది.
పురుషుల సింగిల్స్లో ప్రణయ్ భారీ విజయాన్ని నమోదు చేశాడు. చైనీస్ తైపీకి చెందిన వరల్డ్ నెంబర్ ఫోర్ ప్లేయర్ చౌ తియన్ చెన్ను వరుస సెట్లలో ఓడించాడు. 21-15, 21-17 స్కోర్తో ప్రణయ్ గెలుపొందాడు.