తిరుపతి : రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప స్వామి వారు దర్శమిచ్చారు. హనుమంత వాహనం – భగవత్ భక్తి ప్రాప్తి..హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.