ముంబై: ఈ యేటి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా పేలవ ప్రదర్శన కనబరిచింది. ఆడిన 10 మ్యాచుల్లో ఆ జట్టు ఏడు మ్యాచుల్లో ఓడింది. ఇక టోర్నీకి ముందే రవీంద్ర జడేజాను కెప్టెన్గా ప్రకటించడం తప్పే అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. 8 మ్యాచ్ల తర్వాత ధోనీని మళ్లీ కెప్టెన్గా ప్రకటించడం ఘోరమని సెహ్వాగ్ తెలిపాడు. చెన్నై జట్టు తీసుకున్న నిర్ణయాలపై సెహ్వాగ్ నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతాడని టోర్నీ ఆరంభానికి ముందే చెన్నై ప్రకటించడం తొలి పొరపాటు అని, జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడం తప్పుడు నిర్ణయమని, ఒకవేళ జడేజాను కెప్టెన్గా అంగీకరిస్తే, అప్పుడు సీజన్ మొత్తం అతన్నే కెప్టెన్గా ఉంచాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ ఈ విషయాన్ని తెలిపాడు.
చెన్నై జట్టులో ఈ సారి సెటిల్ ప్లేయర్ ఎవరూ లేరని, ఆరంభంలో గైక్వాడ్ స్కోర్ చేయలేదని, బ్యాటర్లు ఎవరూ పరుగులు రాబట్టలేదని, ఒక మ్యాచ్లో ధోనీ స్కోర్ చేస్తే, మరో మ్యాచ్లో గైక్వాడ్ స్కోర్ చేశారని, ఇంకో మ్యాచ్లో ధోనీ చివర్లో బౌండరీలు కొట్టినా ప్రయోజనం జరగలేదని సెహ్వాగ్ అన్నాడు. ఒకవేళ టోర్నీ ఆరంభం నుంచి ధోనీ కెప్టెన్గా ఉంటే, అప్పుడు పరిస్థితులు చెన్నైకి అనుకూలంగా ఉండేవని సెహ్వాగ్ తెలిపాడు. బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చెన్నై ఓడిన విషయం తెలిసిందే.