న్యూఢిల్లీ: తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన స్టేట్మెంట్లతో అట్రాక్ట్ చేసే విషయం అందరికీ తెలిసిందే. అయితే సోమవారం పార్లమెంట్లో ఆ ఎంపీ తన హ్యాండ్బ్యాగ్ను దాచిపెట్టారు. ఆమె ఎందుకు అలా చేసిందో తెలియదు. కానీ లోక్సభలో ధరల పెరుగుదలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. టీఎంసీ ఎంపీ దస్తీదార్ ధరల పెరుగుదల గురించి మాట్లాడారు. పచ్చి వంకాయను కొరికి ఇలాంటివి తినమంటారా అని కూడా అమె ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో ఎంపీ దస్తీదార్ పక్కనే మహువా మొయిత్రా కూర్చుకున్నారు. దస్తీదార్ మాట్లాడుతున్న సమయంలో తన హ్యాండ్ బ్యాగ్ను తీసి ఎంపీ మహువా టేబుల్ కింద పెట్టారు. ఇంతకీ ఆ బ్యాగ్ను ఎంపీ మహువా ఎందుకు కింద పెట్టిందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ దానికి సంబంధించిన ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ధరల పెరుగుదల గురించి చర్చిస్తున్న సమయంలో ఇలాంటి ఖరీదైన బ్యాగ్లతో పార్లమెంట్కు వస్తారా అన్న డౌట్స్ వ్యక్తం చేశారు. మహువా మొయిత్రా వద్ద ఉన్న బ్యాగ్ లూయిస్ విట్టాన్ బ్రాండ్. ఆ లగ్జరీ బ్యాగ్ ఖరీదు సుమారు రెండు లక్షలు ఉంటుందని కూడా నెటిజన్లు అనుకుంటున్నారు. ఆన్లైన్లో జోరుగా మహువా ట్రోలింగ్ నడుస్తోంది.
As the issue of "mehengai" is raised, somebody's Louis Vuitton bag quickly slides under the bench. pic.twitter.com/Rtra8qsBEt
— Ajit Datta (@ajitdatta) August 1, 2022