మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మహేశ్ బాబు యాక్షన్ లుక్లో కనిపిస్తున్నారు. ఓ భారీ పోరాట ఘట్టానికి హీరో సిద్ధంగా ఉన్నట్లు ఈ స్టిల్తో తెలుస్తున్నది. బ్యాంకింగ్ రంగ నేపథ్యంతో కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ నాయికగా నటిస్తున్నది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఫ్లస్ పతాకాలపై నవీన్ యేర్నేని, వై రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుదిదశలో ఉన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.