తిరుపతి : తిరుపతి(Tirupati) శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ (Mahasamprokshan) కార్యక్రమాలు ఆదివారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. మే 25వ తేదీన మహాసంప్రోక్షణతో ముగియనున్నాయి. ఆదివారం ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 37 మంది రుత్వికులు 19 హోమగుండాలలో హోమాలు నిర్వహించారు.
యాగశాలలో హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవచనం, విష్వక్సేనారాధన, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం, కలశస్థాపన, వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో రవి కుమార్, సూపరింటెండెంట్లు, అర్చక బృందం పాల్గొన్నారు.
మే 24న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి : నారాయణవనం( Narayanavam) శ్రీ పద్మావతి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మే 24న ఉదయం 6-30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. మే 31 నుండి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు(Brahamotsavam) జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.