మహబూబ్నగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ కారణంగా రెండేండ్లుగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను సరిగ్గా నిర్వహించుకోలేకపోయామని ఎక్సైజ్, సాంస్కృతిక మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఈ ఏడాది నవంబ ర్ 5 నుంచి 22 వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలను పూర్తి స్థా యి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో బ్రహ్మోత్సవాల సన్నాహక స మావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సందర్భంగా పరిశుభ్రత, తాగునీటి సరఫరా, 24 గంటల విద్యుత్, వాహనాల పా ర్కింగ్, పురుషులు, మహిళలకు ప్రత్యేక టాయిలెట్లు, ఫుడ్ స్టాళ్లు, అంబులెన్స్, వైద్యులను అందుబాటులో ఉంచాలన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలన్నారు. గతేడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు..
చిన్నచింతకుంట మండల కేంద్రం నుంచి కురుమూర్తికి కొత్తగా రోడ్డు నిర్మాణం కోసం రూ.30 కోట్లు, కురుమూర్తి రోడ్డు నుంచి గుట్టపైకి రూ.11 కోట్లతో రహదారి మంజూరు చేసినందుకుగానూ సీఎం కేసీఆర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టెండర్లు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేవుడికి సేవ చేస్తున్నామన్న భావనతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. 2019లో ఉ ద్దాల ఉత్సవాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారని, క రోనా వల్ల రెండేండ్లుగా భక్తుల సంఖ్య తగ్గిందన్నారు. దేవాలయానికి వచ్చే రహదారులపై ధాన్యం ఆరబోయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జాతర సందర్భంగా రహదారుల మరమ్మతుకు రూ.15 లక్షల జిల్లాపరిషత్ నిధులను మంజూ రు చేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యవేక్షక, పారిశుధ్య, ఆహార, ఫైనాన్స్, శానిటేషన్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. అన్ని కమిటీలపై మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణ ఉంటుందన్నారు. మానిటరింగ్ కమిటీని అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యవేక్షిస్తారని చెప్పారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుధ్యం, టాయిలెట్ల నిర్వహణ, విద్యుద్దీపాలంకరణ, ఫ్లవర్ డెకరేషన్ ఏర్పాటును ఆ యా శాఖల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జాతర సందర్భంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామని, 24 గంటలు పనిచేసేలా ప్రత్యేక కంట్రోల్ రూం శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుందని ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ తేజస్ నందలాల్ పవర్, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చారు. అంతకుముందు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ నివాసరాజు మాట్లాడుతూ నవంబర్ 5 నుంచి 22 వరకు బ్రహ్మోత్సవాలు ఉంటాయని, 9వ తేదీన అలంకరణ ఉత్సవం, 11న ఉ ద్దాల మహోత్సవం ఉంటుందన్నారు. సమావేశానికి ఆర్డీవో ప ద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి తదితరులు హాజరయ్యారు.