మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకుగానూ కేం ద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో 12 స్థానాలకు షెడ్యూ ల్ విడుదల చేసింది. ఈనెల 16న నోటిఫికేన్ విడుదల చేయనున్నది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది జనవరి 4న ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో కలిపి నవంబర్ 16న నోటిఫికేషన్ విడుదలకానున్నది. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 26 వరకు ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉండనున్నది.
ఎన్నికలేవైనా ఏకపక్షంగా మారాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ, 5 జెడ్పీ చైర్మన్ పదవులు సహా 95 శాతానికి పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటైర్లెన స్థానిక సంస్థల ప్రతినిధులు అత్యధికంగా టీఆర్ఎస్కు చెందిన వారే. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటైర్లెన మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 1,390 మందికిగానూ సింహభాగం అధికార పార్టీకి చెందిన వారే కావడం విశేషం. దీంతో కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థిని ప్రతిపాదించేందుకు పట్టుమని 10 మంది కూడా అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు పోటీ చేసే అవకాశమే కనిపించడం లేదు. ఈ తరుణంలో ఉమ్మడి జిల్లాకు చెందిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు సైతం ఏకగ్రీవంగా అధికార పార్టీ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలుగా కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి ఉన్నారు. వీరి పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4న ముగియనున్నది.