మహబూబ్నగర్, నవంబర్ 6 : ఓటరు జా బితాల్లో ఎవరి పేర్లు తప్పులు లేకుండా పూర్తిస్థాయిలో సవరించుకుందామని జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు, రాష్ట్ర హోంశాఖ కార్యద ర్శి చంపాలాల్ అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో కలెక్టర్ వెంకట్రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జా బితా ప్రత్యేక సవరణ ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అయినప్పటికీ తప్పులు లేకుండా చూ సుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. ఈ విషయంపై ప్రజలకు రాజకీయ పార్టీల నేతలు తెలియజేయాలని సూచించారు. ఈనెల 1 నుంచి 31వ తేదీ వరకు క్లెయిమ్స్ స్వీకరణ ఉంటుందని, జనవరి 5 నుంచి తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు తెలిపారు. ఈనెల 6, 7, 26, 27 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారు లు పోలింగ్ కేంద్రాల్లోనే ఉంటారని, అక్కడే క్లెయిమ్స్ సమర్పించవచ్చన్నారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల పేర్లు నమోదు విషయంలో పెద్ద మొత్తంలో ఏ రాజకీయ పార్టీ వ్యక్తులు స మర్పించేందుకుగాను వీలు లేదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఓటరు జాబితాను ప్రతి ఒక్కరూ పునః పరిశీలించుకోవాలని సూచించారు. అంతకుముందు మోడ్ర న్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమావేశంలో వివిధ పార్టీల నే తలు సాయిబాబా, ఎం.రామ్మోహన్, సత్యనారాయణ యాదవ్, ఆది లక్ష్మయ్య, అదనపు కలెక్టర్ సీతారామారావు, ఆర్డీవో పద్మశ్రీ, జెడ్పీ సీఈవో జ్యోతి, డీఆర్డీవో యాదయ్య, ఏవో ప్రేమ్రాజ్ తదితరులు పాల్గొన్నారు.