మక్తల్రూరల్, డిసెంబర్ 2: మక్తల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలపై రాష్ట్ర ముఖ్యమం త్రి కే.చంద్రశేఖరరావు సానుకూలంగా స్పంధించారని స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి తెలిపారు. గురువా రం హైదరాబాద్లో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కలిసి వినతి పత్రా న్ని అందించారు. నియోజకవర్గంలో నెలకొన్న ఆయా ప్రధాన సమస్యలను ఆయన సీఎం దృష్టికి తీసుక వెళ్ళారు. ఈసందర్భంగా సీంఎం కేసీఆర్ సానుకూలంగా స్పంధించారని, ప్రధాన సమస్యలపై స్పష్టమైన హామి ఇచ్చారని ఎ మ్మెల్యే చిట్టెం వెల్లడించారు. ముఖ్యంగా నియోజకవర్గ కేంధ్రంలో మహిళా డిగ్రీకళాశాల లేకపోవడం వలన ఈప్రా ంతంలోని విద్యార్థినీలు నారాయణపేట, మహాబూబ్నగర్ జిల్లా కేంధ్రాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువాల్సి వ స్తుందన్నారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుక వెళ్ళగా ఆయన సానుకూలంగా స్పంధించి తక్షణమే మక్తల్ పట్ట ణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు ఆదేశించారని ఆయన చెప్పారు .అలాగే పట్టణంలో ఫైర్ స్టేషన్లేక పోవడం వల్ల ఏదూన ప్రమాదాలు జరగి నపుడు ‘పేట’ జిల్లా కేంధ్రం నుంచి తెప్పించాల్సి వస్తుందన్నారు. నియోజకవర్గ కేంధ్రంలోనే ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. మక్తల్లో ప్రస్తుం ఉన్న ప్రభుత్వ దవాఖానాలో రోగులకు సరైన పడకలు లేక ఇబ్బందులు ప డుతున్నారని, అందువల్ల 150 పడకల దవాఖానాను విస్తరింప చేయాలని కోరడం జరిగిందన్నారు. ఈమేరకు ప ట్టణంలో 100 జనరల్ బెడ్స్, 50 ప్రసూతి బెడ్స్ ఏర్పాటుకు ప్రొసింజర్ను సిద్దం చేయాలని వైధ్య శాక అధికారు లకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలో పలు గ్రామా ల్లో రోడ్లు తెగిపోయాయని, రోడ్లు మరమ్మత్తు పనులకు నిధులు కెటాయించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఇ దిలావుండగా నియోజకవర్గంలో రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మక్తల్ మండలంలో సంగ ంబండ(నర్సిరెడ్డి), భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయిర్ల కింద ముంపుకు గురైన భూత్పూర్, నేరడిగొమ్ము గ్రా మాలకు ఆర్ఆర్ సెంటరు ్ల ఏర్పాటు చేసి ముంపు బాధితులకు పునరావసం కల్పించాలని, ఇండ్లు కోల్పోయిన బాధితులకు నష్ట పరిహారం మంజూరి చేయాలని సీఎం దృష్టికి తీసుకవెళ్ళడం జరగిందన్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలను ఆయన సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. మక్తల్లో రెండు పడకల గ దుల నిర్మాణం, ఇరిగేషన్ కాల్వల కింద రైతులు ఎదుర్కొంటుంన్న తదితర సమస్యలపై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామి ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి వివరించారు. సీఎం కలిసిన వారిలో రైతు సమన్వయ కమిటీ జిల్లా సభ్యురాలు చిట్టెంసుచరిత ఉన్నారు.