తిరుపతి, జూలై : కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీ మహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి 24వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆన్లైన్ వర్చువల్ విధానంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగాన్ని తలపెట్టింది టీటీడీ. ఇందుకోసం ఈరోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, అనుజ్ఞ, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.