గుణ: మధ్యప్రదేశ్లో 38 ఏళ్ల మహిళకు నిప్పు అంటించారు. భూ వివాదం విషయంలో ఆ మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వం ఆ మహిళకు ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. వివాదాస్పద భూమి వద్దే ఆ మహిళకు నిప్పు అంటించి ముగ్గురు వ్యక్తులు వీడియో తీశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో షేర్ అవుతోంది. గుణ జిల్లాలోని రామ్ప్యారీ షహరియాలో ఈ ఘటన జరిగింది. ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. కాలిన గాయాలతో రోదిస్తున్న భార్యను తన భూమిలో చూసినట్లు ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను సజీవంగా దహనం చేసేందుకు ప్రయత్నించిన వాళ్లు ఓబీసీ వర్గానికి చెందినట్లు భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.