హైదరాబాద్ : ఈ నెల 11న ఉత్తర, మధ్య బంగాళాఖాతం దగ్గరలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం తర్వాత 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాబోయే మూడు నాలుగు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ఈ నెల 12, 13 తేదీల్లో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
13న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షాలు కురస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్లో 11.4 మిల్లీ మీటర్లు, కొత్తగూడెంలో 112, పాల్వంచలో 9.2 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ శాఖ వివరించింది.