హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది బాలిక గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఏపీ కడప జిల్లాలో శుక్రవారం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖాజీపేట మండలంలోని అంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్.. ఖాజీపేట అగ్రహారానికి చెందిన ఓ బాలికను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. తనను పెండ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా వెంటపడుతున్నాడు. అందుకు బాలిక నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
=ఈ క్రమంలో శుక్రవారం బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ కత్తితో బాలిక గొంతు కోశాడు. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు బాలికను హుటాహుటిన కడప రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. పోలీసులు వెంకటేశ్ను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.