ముంబై: మహారాష్ట్రలో గణేశ్ చతుర్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక ముంబైలో ఆ సెలబ్రేషన్ రేంజ్ చెప్పనవసరం లేదు. జీఎస్బీ సేవా మండల్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడు బంగారం, వెండితో ధగధగలాడిపోతున్నాడు. ఆ విఘ్నేశ్వరుడి అలంకరణ కోసం 66 కిలోల బంగారాన్ని, 295 కిలోల వెండిని వాడారు. బంగారంతో వెలిగిపోతున్న ఆ గణేశుడిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండితోనే వినాయకుడిని డెకరేట్ చేసినట్లు జీఎస్బీ సేవా మండల్ ట్రస్టీ అమిత్ పాయి తెలిపారు.