అమరావతి : లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రెండు రోజుల పాటు ఏపీలోని చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకొని, సాయంత్రం 4 గంటలకు తిరుమల వెళ్లనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వైకుంఠద్వార దర్శనం చేసుకుంటారు. తిరుమలలో ఓం బిర్లా శ్రీకృష్ణ గెస్ట్ హౌస్లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత పద్మావతి గెస్ట్హౌస్లో టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఆయన తన పర్యటనలో భాగంగా తిరుమల ధర్మగిరి వేదపాఠశాలను సందర్శిస్తారు. ఆ తర్వాత కపిలేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంటారు.