వీణవంక : దళిత బాంధవుడు సీఎం కేసీఆర్కు ప్రజల నుండి అపూర్వ స్పందన వస్తుంది. ప్రచారానికి వెళ్ళేవాళ్ళు కరపత్రాలు తీసుకుపోవడం సాధారణం. కానీ మండలంలోని వల్భాపూర్ గ్రామంలో దళితులు వినూత్నంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రెండు చేతులా పట్టుకొని దళిత బంధు ముద్దు..బీజేపీ వద్దు అంటూ నినాదాలు చేస్తూ ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలు వివరిస్తున్నారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు , అభినవ అంబేడ్కర్ సీఎం కేసీఆర్ అంటూ పిల్లలు, పెద్దలు, యువ కులు నినాదాలు చేశారు.చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రంగురంగుల పూలతో అలంకరించి , జై తెలంగాణ..జైజై తెలంగాణ అంటూ నినాదాలు చేసి, విస్తృత ప్రచారం చేశారు. దళిత వ్యతిరేకి బీజేపీ పార్టీకి దళితులు ఓట్లు వేయరని, పేద ప్రజలకు అండగా ఉంటున్న సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపుతూ , టీఆర్ఎప్ కే ఓటు వేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు జీడి తిరుపతి, మారముళ్ళ కిరణ్, ప్రభుఆనంద్, అందె కుమార్, మారముళ్ళ రాజేందర్, కుమారస్వామి, మారముళ్ళ సతీష్, మారముళ్ళ విజయ్, తిరుపతి, శ్రీనివాస్, సమ్మయ్య, సుమన్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.