ఆలోచన ఉండేలా గానీ ఎన్ని అద్భుతాలైనా చేయవచ్చు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని దేశాలు ఏ మేర నష్టపోయాయో అందరికీ తెలిసిందే. ఇలాంటి వైరస్లను క్షణాల్లో అంతమొందించే సామర్థ్యం గల నాన్ యూవీ ఎల్ఈడీ లైట్ను హైదరాబాద్కు చెందిన చిప్ ఇండస్ ప్రై. లిమిటెడ్ కంపెనీ తయారు చేసింది. ఈ లైట్ కాంతిని ఇవ్వడంతో పాటు గాలి, భూ ఉపరితలం నుంచి వెలువడే వైరస్లనూ 60 నిమిషాల వ్యవధిలో చంపేస్తుంది. ఇప్పటికే ఈ లైట్ చేసే పనులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ల్యాబ్లు నిర్ధారించాయి.
గాలి, భూ ఉపరితలంపై ఉండే బ్యాక్టీరియా, ఫంగస్ లాంటి రోగ కారకాలను ఈ లైట్ అంతమొందిస్తుంది. బయటికి వెళ్లినప్పుడు లేదా ఇతరులు, వస్తువుల నుంచి వ్యాప్తి చెందిన వైరస్ను ఈ నాన్ యూవీ ఎల్ఈడీ లైట్ 60 నిమిషాల్లో 60 నుంచి 80 శాతం చంపేస్తుంది. అంతేకాక బాత్ రూమ్లో నుంచి కానీ ఇంటి గోడల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియా, ఫంగస్ను ఈ లైట్ నాశనం చేస్తుంది. ఈ లైట్ పనితనంపై 2021 ఆగస్టులో సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యూలర్ బయాలజీ) పరీక్షలు జరిపింది. గాలిలో ఉండే 95 శాతం కొవిడ్-19 వైరస్ను కేవలం 60 నిమిషాల్లో చంపేసిందని ధ్రువీకరించింది. న్యూయార్క్కు చెందిన సినాయ్ హాస్పిటల్ బీఎస్ఎల్ 3 ల్యాబ్, యూఎస్కు చెందిన (సీడీసీ) సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ల్యాబ్లో కూడా ఈ లైట్ను పరీక్షించారు. గది వాతావరణంలో 80 శాతం సూక్ష్మజీవులను కేవలం 60 నిమిషాల వ్యవధిలో చంపేసినట్లు హైదరాబాద్లోని హరిజన్ బయోల్యాబ్స్ నిర్ధారించినట్లు సంస్థ ఎండీ విజయ్ గుప్తా వెల్లడించారు.
వైద్యశాలలు, ఐసీయూలకు అనుకూలం..
గృహాలు, దవాఖానలు, ఐసీయూలు, రెస్టారెంట్లు, మెట్రో కోచ్లు, కార్యాలయాలు, పాఠశాలల గదులు, క్లినిక్లకు ఈ లైట్ ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. మైక్రో బయోలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ అనుసంధానంతో పని చేసే ఈ లైట్ను పనితీరును తెలుసుకొని అనేక మంది కొనుగోలు చేసేందుకు ఆర్డర్లు చేస్తున్నారు. ఇటీవలే హైటెక్స్లో కంపెనీ నిర్వాహకులు స్టాల్ను ఏర్పాటు చేశారు.
ఈ నాన్ యూవీ ఎల్ఈడీ లైట్తో రెండు ప్రయోజనాలున్నాయి. ఇంట్లో కాంతిని ప్రసరింపజేయడంతో పాటు గాలి, భూ ఉపరితలం నుంచి వచ్చే వైరస్ను 60 నిమిషాల వ్యవధిలో చంపేస్తుంది. 12, 16, 24 వాట్స్ సామర్థ్యంతో దొరికే ఈ లైట్ ఖరీదు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఉంది. ఐదు సంవత్సరాల వరకు పని చేసి ఈ లైట్ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ల్యాబ్లు ధ్రువీకరించి ఆమోదించాయి. ఓ వేళ ఎవరికైనా నమ్మకం కుదరకపోతే అందుబాటులో ఉన్న మైక్రో బయాలజీ కేంద్రం ద్వారా ఈ లైట్ పనితనాన్ని తెలుసుకోవచ్చు.
చిప్ ఇండస్ ప్రై. లిమిటెడ్ కంపెనీ నాన్ యూవీ ఎల్ఈడీ లైట్ను 12,16, 24వాట్స్ల సామర్థ్యంతో తయారు చేసింది. ఈ కంపెనీ భారత్లో మూడు దశాబ్దాలుగా తన సేవలు అందిస్తున్నది. అంతేకాక ఐఐఎస్సీ నుంచి గోల్డ్ మెడల్ పొందిన ఇంజినీర్ల నేతృత్వంలో ఎల్ఈడీ సెమీ కండక్టర్ల ఉత్పత్తులను రూపొందిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్గుప్తా తెలిపారు.
ఎలాంటి దుష్ప్రభావాలు లేవు..
హ్యూమన్ సేఫ్ ఇండోర్ యాంటీ కొవిడ్, యాంటీ బ్యాక్టీరియల్గా ఈ లైట్ పని చేస్తుంది. ఈ లైట్తో ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు.నాన్ యూవీ ఎల్ఈడీ లైట్ ఐదు సంవత్సరాల వరకు పని చేస్తుంది. కుషాయిగూడ ఉన్న కంపెనీలో తయారవుతున్న ఈ లైట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో దొరుకుతుంది. మరిన్ని వివరాల కోసం www.raypure.in లేదా ఫోన్ నంబర్ 7981230551లో సంప్రదించవచ్చు.