న్యూఢిల్లీ, మే 24: కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ ఎల్జీ..దేశీయ టీవీ మార్కెట్పై ప్రత్యేక దృష్టి సారించింది. 2022లో టీవీ మార్కెట్లో 32 శాతం వాటా లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ..అందుకు తగ్గట్టుగా ఒకేసారి పలు టీవీలను మార్కెట్కు పరిచయం చేసింది.
ఈ సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ హెడ్ కిమ్ మాట్లాడుతూ..దేశీయ కస్టమర్లు కోరుకుంటున్న విధంగా నూతన టీవీలను తీర్చిదిద్దినట్లు, ముఖ్యంగా రిటైల్, సేల్స్ నెట్వర్క్ను మరింత విస్తరిస్తున్నట్లు చెప్పారు. దేశీయ మార్కెట్లోకి ప్రపంచంలో అతిపెద్ద టీవీని ఎల్జీ పరిచయం చేసింది. 97 అంగుళాల టచ్స్క్రీన్ కలిగిన ఈ టీవీ ధర రూ.75 లక్షలుగా నిర్ణయించింది. ప్రారంభ ధర రూ.89,990గా నిర్ణయించింది.