శేరిలింగంపల్లి : మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని సమాజహితం కోసం మట్టి వినాయకులను పూజిద్దామని అన్నారు.
పర్యావరణ పరిరక్షణలో బాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ రసాయనాల విగ్రహాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. వివిద రసాయనాలతో చేసిన వినాయకుల ప్రతిమల నిమజ్జనం ద్వారా చెరువులు, కుంటలు కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని భావి తరాలను దృష్టిలో ఉంచుకొని అందరం మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు.
మియాపూర్ కార్పొరేటర్ శ్రీకాంత్, శేరిలింగంపల్లి డీసీ వెంకన్న, ప్రాజెక్టు అధికారి మన్వీ, శానిటేషన్ సూజర్వైజర్ జలందర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, మిరియాల రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.