లండన్: ఆగస్టు 27 నుంచి శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ ఆ దేశంలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పరారీ అయ్యారు. అయితే ఈ తరుణంలో అక్కడ క్రికెట్ సిరీస్ జరుగుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మీడియాతో స్పందించారు. శ్రీలంకలో ఉన్న సంక్షోభ పరిస్థితిపై ఇప్పుడు ఏమీ కామెంట్ చేయలేమన్నారు. అయితే పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామన్నారు. ప్రస్తుతం శ్రీలంకతో ఆస్ట్రేలియా ఆ దేశంలోనే ఆడుతోందని, శ్రీలంక జట్టు అద్భుతంగా రాణిస్తోందని, కాబట్టి ఈ అంశంపై మరో నెల రోజుల పాటు వేచి ఉండాలని గంగూలీ అభిప్రాయపడ్డారు. మరోవైపు మాల్దీవులకు పరారీ అయిన గోటబాయ ఇవాళ అక్కడ నుంచి సింగపూర్కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.