లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారన్న ఊహాగాలకు సుహలదేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్భర్ తెరదించారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను రాజ్భర్ కలిశారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతున్నది. దీనిపై ఆయన స్పందిస్తూ.. తాను ఢిల్లీకే వెళ్లలేదని, అమిత్షాను కూడా కలవలేదని పేర్కొన్నారు. బీజేపీతో కలిసి పనిచేయబోమని, ఎస్పీతోనే కొనసాగుతామన్నారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలసి ఎస్బీఎస్పీ పోటీ చేసింది. 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకొని ఇటీవల ఎస్పీతో జట్టు కట్టింది.