కాజీపేట, నవంబర్ 29: కాజీపేట రైల్వే జంక్షన్కు న్యాయపరమైన డిమాండ్లు నెరవేరే దాకా పోరాడుదామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. కాజీపేట చౌరస్తాలో తెలంగాణ రైల్వే ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ కొండ్ర నర్సింగరావు అధ్యక్షతన చేపట్టిన మహా నిరాహార దీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. ఆదివారం అర్ధరాత్రి తర్వాత చీఫ్ విప్ దాస్యం.. దీక్ష స్థలిని సందర్శించి సంఘీభావం తెలిపారు. జేఏసీ బృందం నుంచి రైల్వే డిమాండ్లను తెలుసుకుని పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం దాస్యం మాట్లాడుతూ.. కార్మికులు, కార్యాలయాలతో ఒకప్పుడు కళకళలాడిన కాజీపేట జంక్షన్ ఇప్పు డు వెలవెలబోతున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రంలోని రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ను కావాలనే నిర్వీర్యం చేసేందుకు యత్నిసున్నదని మండిపడ్డారు. దక్షిణ మధ్య రైల్వేకు అధిక లాభాలను ఇస్తున్న కాజీపేట జంక్షన్కు డివిజన్ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎంపీలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని స్పష్టంచేశారు.