హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణను ఆంధ్రాలో కలపాలన్న నేతల కుట్రలను తిప్పికొడుదామని టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీ విఠల్ పిలుపు నిచ్చారు. రెండు రాష్ర్టాల్లోని నాయకుల కుయుక్తులను గమనించి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన ఒక ప్రకటనలో సూచించారు. ఏపీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమైక్య వాదనలు వినిపించటంపై విఠల్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన జగ్గారెడ్డి సమైక్య రాగం వినిపించటం కంటే దిగజారుడు రాజకీయం ఇంకేముంటుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణను రక్షించేందుకు అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవ్వాలని విజ్ఞప్తిచేశారు.